14 July, 2026 | 7:17 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

బుగులోని జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

11-09-2025 06:02 PM

గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్..

రేగొండ (విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతరలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నవంబర్ మాసంలో జరిగే జాతర వరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ఆశీస్సులతో అన్ని పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్ అన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ. 2 కోట్లతో స్వామివారి కొండపైకి ఎక్కే భక్తుల కోసం మెట్ల వెడల్పు, కోనేరు, నీటి గుండం, లను వెడల్పు చేసే వంటి అభివృద్ధి పనులపై శంకుస్థాపనలు చేయగా గురువారం నుండి కాంట్రాక్టర్ లు పనులు ప్రారంభించారు. ముందుగా మెట్ల వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేట్టుగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తేదారు లక్కం రాములు,సూర బాపురావు, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, నాయకులు పల్నాటి శ్రీను, సిద్ధ సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.