17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎల్లంపేట అంగన్వాడీ కేంద్రంలో శానిటేషన్‌పై అవగాహన కార్యక్రమం

02-01-2026 12:00 AM

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత 

ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ 

మరిపెడ, జనవరి1(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట త్రీ అంగన్వాడి కేంద్రం నందు శానిటేషన్, ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్, ఉషారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా శానిటే షన్ అవగాహన కార్యక్రమాలు పిల్లలు తల్లులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన తాగునీరు మరుగుదొడ్ల వాడకం ఆహార శుభ్రత వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్పించాలని అన్నారు.తల్లులకు బాలామృతం టి హెచ్ ఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉషారాణి అంగన్వాడి టీచర్ విజయ కుమారి, నవనీత, శ్రీమతి, ఆశ వర్కర్ తల్లులు, గర్భిణీలు పాల్గొన్నారు.