25-10-2024 12:00:00 AM
పీకేఎల్ 11వ సీజన్
హైదరబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగాల్ 32 యూపీ యోద్ధాస్పై విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాల్ తరఫున మణిందర్ 8 పాయింట్లు, సుశీల్, నితిన్ చెరో 7 పాయింట్లు సాధించారు.
యూపీ తరఫున భరత్ 13 పాయింట్లు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక రెండో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 37-24 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. నేడు పట్నాతో తమిళ్ తలైవాస్, పునేరితో బెంగళూరు తలపడనున్నాయి.