29 March, 2026 | 10:23 AM

భారత్‌కు 125వ స్థానం

25-10-2024 12:00 AM

ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్

న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు గురువారం విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకొని 125వ స్థానంలో నిలిచింది. ఈ నెల ఆరంభంలో వియత్నాంతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను భారత్ 1 డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రా ద్వారా 0.26 పాయింట్లు సాధించిన భారత్ 1133.78 పాయింట్లతో 125వ స్థానంలో నిలిచింది. ఇక ఆసియా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 22వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తొలి స్థానంలో ఉంది.