17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అందెశ్రీ మరణం సమాజానికి తీరని లోటు

10-11-2025 04:19 PM

టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తులసి ఆగమయ్య

ధర్మపురి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా కవి, వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర గీత ఆవిష్కర్త అందెశ్రీ ఆకస్మిక మరణం తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి, కళా రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి తులసి ఆగమయ్య అన్నారు. అందెశ్రీ మరణ వార్త తెలియగానే వెల్గటూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల పైడిపల్లిలో స్కూల్ అసెంబ్లీలో ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆయన చేసిన కృషి అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.