11-08-2025 01:44:55 AM
ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): అడికెమెట్ డివిజన్ రాంనగర్ మేడిబావి బస్తీలో అమ్మవారి ఓడిబియ్యంతో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింగ్ రావు, కమిటీ నాయకులు కె. కాశీనాథ్, నర్సింహా, జహంగీర్, ప్రభాకర్, అభి తదితరులు పాల్గొన్నారు.