13 April, 2026 | 1:44 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

మూడు ప్రశ్నలకు సమాధానమివ్వండి !

10-12-2025 02:39 AM

ఈసీని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ 

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: బీజేపీ చేసిన పాపాలను తప్పించేందుకే ఎన్నికల సంఘం(ఈసీ) పనిచేస్తున్నదని, ఒక పథకం ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించకుండా కాపుకాస్తోందని కాంగ్రెస్ సభ్యుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ వేదికగా మంగళవారం మరోసారి ఆయన ఈసీపై విమర్శలు చేశారు. ఈసీ స్వయంప్రతిపత్తి ఎందుకు బలహీనడపడుతున్నదని ప్రశ్నించారు. ‘సర్’పై రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున, ఈసీ ఓటర్ల జాబితా తారుమారు కాదని ఏం భరోసా ఇస్తుందని నిలదీశారు. ఈసీ పరిధిలో నియామకాలు ఎందుకు రాజకీయ ప్రయోజనాలుగా ఉంటున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.