calender_icon.png 20 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన తహసీల్దార్‌గా అనూష బాధ్యతల స్వీకరణ

20-09-2025 12:00:00 AM

ఆళ్ళపల్లి, సె ప్టెంబర్ 19 (విజయక్రాంతి) : ఆళ్ళ పల్లి నూతన తహశీల్దార్‌గా చెదల వాడ అనూష శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ  డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి ట్రాన్స్‌ఫర్‌పై కలెక్టర్ ఆఫీస్ అక్కడి నుండీ పినపాక డిప్యూటి తహశీల్దార్ గా విధులు నిర్వహించి. ప్రమోషన్ పై తహశీల్దార్‌గా ఇక్కడకు వచ్చారు.

నూతన తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సంధర్భంగా తహశీల్దార్ అనూష ను రెవెన్యూ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ సంధర్భం గా తహశీల్దార్ అనూష మాట్లాడు తూ తన వద్దకు వచ్చిన ఎటువం టి భూ సమస్యనైనా పరిష్కరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.