04-03-2025 12:00:00 AM
సిరిసిల్ల, మార్చి 3 (విజయ క్రాంతి) ః జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖకు 45, మున్సిపల్ సిరిసిల్ల 14, జిల్లా సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, ఎస్ డి సికి ఆరు చొప్పున,విద్యాశాఖకు 5 , ఎస్పీ ఆఫీస్ కు 4,; నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ఎంపీడీవో తంగళ్ళపల్లికి మూడు చొప్పున,డి ఆర్ డి ఓ, రిజిస్టర్, సెస్ కు 2 చొప్పున, సర్వేశాఖ, ఆర్ అండ్ బి, జిల్లా పౌరసరఫరాల శాఖ,; సిపిఓ డిపిఓ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్సుటైల్స్ ,; ఎస్సీ కార్పొరేషన్ కు ఒకటి చొప్పున వచ్చాయి.