24 May, 2026 | 5:29 AM

ప్రజావాణికి 576 అర్జీలు

14-09-2024 12:34 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 576 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖకు 214, రెవెన్యూ 78, విద్యుత్  56, మైనార్టీ వెల్ఫేర్ 44, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 44, ఇతర శాఖలకు 140 దరఖాస్తులు అందాయని వెల్లడించా రు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన అధికారి దివ్య  ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు  తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.