12 July, 2026 | 4:11 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండి

09-10-2025 12:30 AM

అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 08: రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.. రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఐ పల్లవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు 50శాతం రాయితీపై బ్యాటరీ పంపులు, పవర్ పంపులు, రోటోవెటర్లు, వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలో ఉన్న రైతులు పట్టాదార్ పాసుబుక్కులు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ట్రాక్టర్‌తో నడిచే పనిముట్లకు ట్రాక్టర్ ఆర్సీలను జతపరిచి సంబంధిత వ్యవసాయ కార్యాలయంలో అందజేయగలరు. పూర్తి వివరాల కోసం అబ్దుల్లాపూర్ మెట్‌లోని రైతు వేదికను ఆశ్రయించి వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించగలరు. పూర్తి వివరాల కోసం మండల వ్యవసాయాధికారి సెల్ : 8977753709,  వ్యవసాయ విస్తరణ అధికారి: 6305920181.