12 July, 2026 | 3:12 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

జనావాసాల మధ్య పటాకుల దుకాణాలు వద్దు: మున్సిపల్ కమిషనర్

09-10-2025 12:32 AM

  తాండూరు 8 అక్టోబర్ (విజయక్రాంతి) : రాబోయే దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచా దుకాణాలను నిబంధన మేరకు అనుమతి పొంది ఏర్పాటు చేసుకోవాలని  వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. బుధవారం  బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే యజమానులతో సమావేశం నిర్వహించారు.నివాస ప్రాంతాల్లో బాణా సంచ దుకాణాలను ఏర్పాటు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లైసెన్సును పొందడానికి  అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్ కుమార్, వెంకటయ్య, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.