23-12-2025 04:43:50 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో వెలసిన కోట్ల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి నూతన కమిటీ నియాగమకం జరిగింది . మంగళవారం ఆలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు ఎండ్రికాయల నగేష్, ఉపాధ్యక్షుడు, బోయిని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి, బోయిని ప్రభు, సహాయ కార్యదర్శి సిహెచ్ అరుణ్ కుమార్, కోశాధికారి ఏ గోపాల్, సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్, సలహాదారులుగా సిహెచ్ రాకేష్, కొత్త ఆంజనేయులు, సిహెచ్ రవి, సందీప్ చారి, ఏ నరేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ... పురాతనమైన ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు, యువకులు, భక్తుల సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.