15 March, 2026 | 8:15 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఖానాపూర్ ఆసుపత్రి వార్షిక తనిఖీ చేసిన ఏఎస్ సీఐ బృందం

08-10-2025 02:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని(Khanapur Hospital) వంద పడకల అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బృందం డీన్ డాక్టర్ శుభోద్ కందముతో అన్నారు. బుధవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని వారు వార్షిక తనిఖీ చేసేందుకు వచ్చారు. దీంట్లో భాగంగా ఆసుపత్రిలో వసతులను పరిశీలించి, అవసరతలు పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన విలేకరులకు తెలియజేశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పై విధంగా వారు స్పందించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వంశీ ,డాక్టర్ స్వర్ణ రెడ్డి ,సిబ్బంది తదితరులు ఉన్నారు.