22 June, 2026 | 7:23 PM

Breaking News

అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి   •   అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం   •   గోండుగూడెం సందర్శించిన తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు   •   ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించి డంపింగ్ యార్డ్ ను తొలగించండి   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ కాన్పుల సంఖ్యను పెంచాలి

08-10-2025 04:32 PM

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పుల సంఖ్యను పెంచేలా గ్రామాల్లోని గర్భిణీలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లితో పాటు జాజిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానుకూలంగా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, డాక్టర్ ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్లు చొక్కయ్య, సునీత, మాధవి, అనుష, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.