27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు

22-10-2025 01:51 PM

ఘనంగా అశ్వకుల్లాఖాన్ జయంతి వేడుకలు

మందమర్రి,(విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు మాజీ ఆర్మీ జవాన్ రాజేష్ కుమార్ పివ్హాల్ - రాణి పివ్హాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి హైస్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  పురుషోత్తం మాట్లాడుతూ... అక్టోబర్ 22, 1900  సం.లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ ముస్లిం కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే దేశభక్తి భావాన్ని పెంపొం దించుకొని స్వాతంత్ర పోరాటంలో ఆసక్తిని పెంచుకోవడంతో పాటు  మహాత్మా గాంధీ చేపట్టిన  సహాయ నిరాకరణ ఉద్యమంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

చిన్నతనం నుండే దేశ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి దేశ వీర మరణం పొందారని ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించు కోవడంతో పాటు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాజేష్ కుమార్ పివ్హాల్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుల, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్, పి తిరుపతి, జి దేవమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.