15 April, 2026 | 9:29 AM

పేకాట స్థావరంపై దాడి.. నలుగురుపై కేసు నమోదు

21-10-2025 10:24 PM

ఎస్ఐ స్రవంతి..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శివారులో ఎడ్ల కట్ట వాగు సమీపంలోని సంగమేశ్వర్ రోడ్డుకు దగ్గరలో గల బహిరంగ ప్రదేశంలో మంగళవారం నలుగురు వ్యక్తులు మూడు ముక్కలాట ఆడుతుండగా ఇట్టి సమాచారం మేరకు దోమకొండ ఎస్సై స్రవంతి ఆదేశాల మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి వెళ్లి, వారిని పట్టుకోని వారి వద్ద గల 11 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయనైనదనీ దోమకొండ ఎస్ఐ స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు.