calender_icon.png 13 January, 2026 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసికందు విక్రయానికి యత్నం.. అడ్డుకున్న అధికారులు

13-01-2026 08:19:10 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి): గిరిజన పసికందు అమ్మకానికి తల్లి ప్రయత్నం  చేయగా అధికారులు అడ్డుకున్నా రు. బుధవారం ఫరూఖ్‌నగర్  మండలానికి చెందిన ఉప్పరిగడ్డ గిరిజన తాండాకు చెందిన ఒక మహిళ  నేలల వయస్సు ఉన్న చిన్నారి బాలికను విక్రయించడనికి యత్నించింది. వరుసగా ముగ్గురు కాన్పులో అమ్మాయిలు పుటారు. ముగ్గురు అమ్మాయిలు కావడంతో మూడవ అమ్మాయి  విక్రయించాడనికి యత్నించారు. కాగా సమాచారం  తెలుసుకున్న అధికారి తల్లిదండ్రులు, బాలికను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.