12-12-2024 12:22:57 AM
మూడో వన్డేలో భారత్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కంగారూలతో జరిగిన వన్డే సిరీస్లో 3 వైట్వాష్కు గురైంది. బుధవారం పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో హర్మన్ సేన 83 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
అన్నాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110) సెంచరీతో రాణించగా.. అష్లే గార్డనర్ (50), తాహిలా (56*) అర్థ తకాలతో రాణించారు. హైదరాబాదీ బౌలర్ అరుంధతీ రెడ్డి 4 వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (105) సెంచరీతో రాణించినప్పటికీ మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అష్లే గార్డనర్ 5 వికెట్లతో చెలరేగింది.