15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కళాశాల విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన

06-11-2025 08:43 PM

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తెలంగాణ ఆర్టిఐ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి సయ్యద్ కలీం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ పౌరులకు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కు ఈ చట్టం కల్పించిందని అన్నారు. ఈ చట్టం ద్వారా పాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు అవినీతిని తగ్గించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో నైనా సమాచారం కోసం భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు సమాచారం అందించడం సంబంధిత శాఖ అధికారులపై ఉంటుందని తెలిపారు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ పాలడుగు సునీల్ కుమార్, ఫోరం జిల్లా ప్రచార కార్యదర్శి ఎం నవీన్, సయ్యద్ అబిద్ అలీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.