17 April, 2026 | 2:05 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ

17-05-2025 12:00 AM

గోపాలపేట మే 17 : గోపాలపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై రాలి నిర్వహించారు. శుక్రవారం డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డాక్టర్ తన కుమారి మెడికల్ డాక్టర్ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రావడానికి కారణాలు దోమల వల్లేనని తెలిపారు. దోమలు ఉద్భవించకుండ  నివారించాలని తెలిపారు.

డెంగీ దోమలు మంచినీళ్లలో టైర్లలో ము రుగునీళ్లలో ఉద్భవిస్తాయని చెప్పారు. ఉదయం సమయంలో కుట్టే ఆడదని వల్లే డెంగ్యూ వ్యాధి వస్తుందని కాలనీవాసులకు డాక్టర్ కృష్ణకుమారి చెప్పారు.

ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ముందు నీరు నిలవకుండా చూసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఏఎన్‌ఎంలు ఆశ వర్కర్లు ఉన్నారు.