17-05-2025 11:08:08 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతన్ పల్లి ప్రెస్క్లబ్ 259/19 నూతన కార్యవర్గాన్ని శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడిగా రామిల్ల శ్రీనివాస్ ని పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు తూముల భవిష్యత్, కోశాధికారి రాజు, ప్రచార కార్యదర్శి రామిడి సాయి సృజన్, సంయుక్త కార్యదర్శి పోల్ దాసరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తనను అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో తను ముందుంటానని హామీ ఇచ్చారు.