14-06-2025 12:00:00 AM
ముషీరాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి) : హుస్సేన్సాగర్ లేక్లో జరుగుతున్న మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్ గ్రీన్ ఫ్లీట్ విభాగంలో ఆయు కుమార్, సాక్షి చౌన్కర్ దూసుకెళ్తున్నారు. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ దత్తత తీసుకున్న హర్యానాకు చెందిన ఈ ఇద్దరు సెయిలర్లు స్వర్ణ పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. ఆయు కుమార్ బాలుర విభాగంలో అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సాక్షి మొదటి స్థానంలో ఉంది.
ప్రతి కూల వాతావరణం నేపథ్యంలో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చతుర్వేది గురువారం ఉదయం సెషన్లో అతి కష్టం మీద ఒక్కో రేసును మాత్రమే నిర్వహించగలిగారు. అయితే, ఈ రేసు తర్వాత ఒక్క సారిగా నిరసనలు రావడంతో అండర్-19 29 ఇఆర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న తంగై, దివాకర్లపై జ్యూరీ అనర్హత వేటు వేసింది.
మికస్డ్ డబుల్స్ ఈ వెంట్లో తనుజ-శ్రవణ్ జోడీ తమ విజయ పరంపరను కొనసాగించింది. బాలికల విభాగంలో జరిగిన ఏకైక రేసులో ఆలియా సబ్రీన్, అండర్-18 లేజర్ విభాగంలో శరణ్య యాదవ్ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచారు. సాయం త్రం పోటీలు పూర్తిగా రద్దయ్యాయి.