14-06-2025 12:00:00 AM
రాష్ట్ర కురుమ సంఘం
ఖైరతాబాద్; జూన్ 13 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్య పద్ధతిలో కురుమ సంఘం ఎన్నికలు నిర్వహించాలని మన రాష్ట్ర కురు మ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు కోశిక శ్రీనివాసరావు, దేవర శ్రీనివాస్, జక్కుల కృష్ణ, రాకేష్ , శ్రీనాథ్ మేటర్ హాజరై మాట్లాడారు..
ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన కురువ సంఘం ఎన్నికలను సంఘం భైలాస్కు విరుద్ధంగా నాలుగు గోడల మధ్య మండల , జిల్లా కమిటీలు వేసుకొని జీవితాంతం తానే అధ్యక్షుడుగా కొనసా గాలని సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. బైలాస్కు విరుద్ధంగా గత 20 సంవత్సరాలుగా తానే అధ్యక్షుడిగ కొనసాగుతూ సం ఘం ఆస్తులతో లక్షలాది రూపాయల ఫీజు లు వసూలు చేస్తున్నాడని అన్నా రు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేటలో కురుమల ఆత్మ భవన నిర్మాణం కోసం కోకాపేట్లో కేటాయించిన పది ఎకరాల భూమి ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కో సం ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. కావున ఎగ్గే మల్లే శం స్వతహాగా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసి నూతన కమిటీ ఎన్నికకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సం ఘం నాయకులు చంద్రశేఖర్, సత్యనారాయణ, మనోజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.