13-09-2025 02:40:46 AM
తూప్రాన్, సెప్టెంబర్ 12 :తూప్రాన్ పురపాలక సంఘ పరిధి మోర్ సూపర్ మార్కెట్ ముందు ఉన్న చెట్టు కొమ్మలను మున్సిపాలిటీ అనుమతి లేకుండా నరికి వేసినందున మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపార సముదాయానికి రూ.5 వే ల జరిమానా విధించడం జరిగింది.
ఈ సం దర్భంగా ఎవరైనా సరే మున్సిపల్ కు సం బంధించిన చెట్లను గాని, మొక్కలను గాని నరికివేసినా, తీసివేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ శాఖ దుర్గయ్య, ఎన్విరాన్మెం ట్ మధులు ఉన్నారు.