పార్లమెంట్‌లో మీ గొంతుక అవుతా..

25-04-2024 02:23:38 AM

నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్పీ ప్రవీణ్ కుమార్

ఆమనగల్లు బ్లాక్ మండలాలో ఎన్నికల ప్రచారం

రంగారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : గత ఎంపీల మాదిరిగా తాను హామీలు ఇవ్వలేను అని తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో మీ గొంతుక అవుతానని నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు బ్లాక్ మండలల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర పుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళీ శ్రీనివాస్‌రెడ్డి, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశిం చి ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీ  కేం ద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీలు బడేబాయి చోటాబాయి అంటూ తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన నేతలం తా తమ స్వలాభం కోసమే రాజకీయాలను చేశారని ఈ ప్రాంత అభివృద్ధి ఎప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. తాను గురుకుల కార్యదర్శిగా వేలాది బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దానన్నారు. పార్లమెంట్ ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటేసి పార్లమెంట్ పంపాలని కోరారు.