calender_icon.png 29 September, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

29-09-2025 12:42:29 AM

చేగుంట, సెప్టెంబర్ 28 :చేగుంట మండల కేంద్రంలోని తపస్ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ దాస్య సుంకలాల విముక్తికై ప్రాణాలను తృణపాయంగా అర్పించి, ఉరికంబంపై గర్జించి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండలాల  అధ్యక్షులు రావుల వెంకటేష్, తీగుళ్లస్వామి, తపస్  చేగుంట మండల ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, దేవానంద్ తదితరులుపాల్గొన్నారు.