10 May, 2026 | 11:53 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

పాము కాటుకు బాలుడి మృతి

21-09-2025 12:00 AM

-నిద్రిస్తున్న సమయంలో కాటు వేసిన వైనం  

-కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్‌లో ఘటన

కామారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నిద్రిస్తున్న బాలుడిని పాము కాటు వేసి ప్రాణా లు తీసిన ఉదంతం ఇది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన గంగుల రాజమణి తన మూడేళ్ల కుమారుడు భాస్కర్ ను తీసుకొని తల్లిగారి ఊరు మహమ్మద్‌నగర్‌కు గురువారం వచ్చింది. రాత్రి నిద్ర పోతున్న సమయంలో భాస్కర్‌ను పాము కాటు వేసిం ది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొం దుతూ శనివారం మృతి చెందినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. బాలుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.