30-07-2025 01:39:39 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) కొత్త చై ర్మన్గా బీపీ పాండేను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఆయన చైర్మన్గా బాధ్యతల్లోకి వస్తారు. ఈ ఏడాది ఫిబ్రవ రిలో జీఆర్ఎంబీ చైర్మన్గా వచ్చిన ఏకే ప్రధాన్ స్థానంలో బీపీ పాం డేను నియమించారు.