12 March, 2026 | 10:20 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

20-11-2025 12:57 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 19(విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బుధవారం శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఇంచార్జి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు సూచనలు, సలహా మేరకు, చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులు  బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద ర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో అభివృద్ధి కుంటుపడింది, ప్రజలు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రజాప్రతినిధులు వారూ ఏ పార్టీలో ఉన్నారో వారికె తెలియని పరిస్థితిలో ప్రజ లు అయోమయంలో ఉన్నారన్నా రు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వారి పదవులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారని రాబో యే కాలంలో ప్రజల వ్యతి రేకతతో బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, వాల హరీష్, పార్నం ది శ్రీకాంత్, రవీందర్ యాదవ్, గౌస్, బాబు మోహన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.