11 March, 2026 | 2:51 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

రాజ్యాంగ వ్యవస్థలను కించపరచొద్దు

20-11-2025 12:12 AM
  1. రాజకీయ నేతలు గౌరవప్రదంగా వ్యవహరించాలి
  2. ప్రజాస్వామ్య పునాది సంస్థలపై దాడి సరికాదు
  3. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ
  4. ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఎన్నికల సంఘంపై మద్దతు

న్యూఢిల్లీ, నవంబర్ 19: ఎన్నికల కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై బుధవారం ఆయనకు దేశవ్యాప్తంగా 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఆర్మీకి చెందిన133 మంది రిటైర్డ్ అధికారులు విమర్శించారు. ‘ఓటు చోరీ’పై రాహుల్ గాంధీ చేసిన ఆరో పణలను కొట్టిపడేస్తూ ఎన్నికల సంఘాన్ని సమర్థించారు. భారత ఎన్నికల కమిషన్ వంటి రా జ్యాంగ సంస్థలపై కళంకం వచ్చేలా రాహుల్ గాం ధీ వ్యవహరించారంటూ పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సరైనదేనని, ఆ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి పునాది సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కించపరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ నేతలెవరైనా రాజ్యాంగ సంస్థలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఓటు చోరీ పేరిట ఎన్నికల కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు.

రాజకీయ నేత లు విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా వారి రాజకీయ వ్యూహాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఈసీలో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వ్య క్తుల వరకు ఎవరినీ వదిలిపెట్టబోనని బెదిరిస్తుండడాన్ని కూడా లేఖలు రాసిన ప్రముఖులు తప్పుబట్టారు.

సర్ గురించి ఈసీ ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. ఈ ప్రక్రియలో అనర్హులును తొలిగించి, కొత్తవి అర్హత కలిగిన ఓటర్లను చేర్చడం మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాజకీయా లపై అతనికి ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కన్పిస్తుందని అభిప్రాయపడ్డారు.