10 April, 2026 | 5:29 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

బీఆర్‌ఎస్ నిరసన..

01-10-2025 01:26 AM

కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రం లోని రాంనగర్ లోగల మార్క్ ఫెడ్ మైదానం లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా దసరా రోజున నిర్వహించే రాంలీలా కారక్రమాన్ని నిర్వహించకుండా మార్క్ ఫెడ్ గేట్ కు తాళం వేయడాన్ని నిరసిస్తూ.. BRS పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు గేట్ ఎదురుగా ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.

రాంలీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తే ఊరుకోం: సుడా చైర్మన్‌రామ్ లీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తామంటే ఊరుకోమ ని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

విగ్ర హం ఏర్పాటు విషయంలో మార్క్ ఫెడ్ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని గే టుకు తాళం వేశారని అన్నారు. ఈ విషయం లో కాంగ్రెస్ పార్టీ నాయకులను బాద్యులను చేయడమేమిటని ప్రశ్నించారు.అందరం కలి సి ప్రోటోకాల్ పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, బిఆర్‌ఎస్ నాయకు లు రాద్ధాంతం చేయడం మాని సహకరించాలని నరేందర్ రెడ్డి కోరారు.