30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బస్టాండ్ అవుట్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ

17-05-2025 12:27 AM

కరీంనగర్ క్రైం,మే16(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం  శుక్రవారం నాడు కరీంనగర్ బస్టాండులోని ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. బస్టాం డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.

అవుట్ పోస్ట్లోని సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండా లని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం అవుట్  పోస్ట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన కమీషనర్, బస్టాండ్ ఆవరణలో నిరంతరం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశిం చారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.