25-08-2025 11:24:48 PM
రాజాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు లేని పేదలందరికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఏఎంసీ వైఎస్ చైర్మన్ జవాజి శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విస్లావత్ శ్రీనివాస్ నాయక్ ఆన్నారు. సోమవారం రాజాపూర్ మండలం ఈద్గాన్ పల్లి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృషితో గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.