02-01-2026 08:27:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు అమరావతి జిల్లాలో జరిగే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్మల్ జిల్లాకు చెందిన కవి రచయిత సంస్కృత భాష ప్రచార సమితి అధ్యక్షులు డి.వెంకట్ కు ఆహ్వాన పత్రం అందింది. మూడు రోజులపాటు జరిగే ఈ మాసభల్లో ఈయన పాల్గొని తెలుగు భాష అభివృద్ధి అంశంపై తన రచనలను వినిపించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రపంచ మహాసభలకు ఎంపిక కావడం పట్ల ఆయనకు నిర్మల్కు చెందిన కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.