23-07-2025 01:45:48 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మొఘ గ్రామం లో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు 25 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా మద్నూర్ వైస్ ఏఎంసీ చైర్మన్ పరమేష్ పటేల్ మాట్లాడుతూ.. గత పరిపాలకుల నిర్లక్ష్యంతో కనీసం గ్రామాలలో రోడ్లు వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.