29-06-2025 10:24:22 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చిర్ర సత్తమ్మ మరణించారు. సత్తమ్మ మరణ వార్త తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత(Former MP Maloth Kavitha) ఆదివారం బ్రాహ్మణపల్లికి వచ్చి సత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తెమ్మ మనుమడు, బీఆర్ఎస్ యువజన విభాగం మహబూబాబాద్ నేత చిర్రా ఏకాంతం గౌడ్ ను పరామర్శించారు.