calender_icon.png 30 June, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులను పార్టీలకతీతంగా గెలిపించండి..

29-06-2025 10:20:38 PM

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పిలుపు..

ఆర్యవైశ్య వైరా మండల మహాసభ ఆధ్వర్యంలో.. 'పసుమర్తి' కు ఘన సన్మానం...

వైరా (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యలు అందరు ఐక్యంగా ఉండి పోటీచేసి మన ఆర్యవైశ్యులు ఏ పార్టీ నుండి పోటీ చేసిన పార్టీలకతీతంగా మన సభ్యుల గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వైరా ఆర్యవైశ్య మండల సభ ఆధ్వర్యంలో వైరా మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్(Mandal President Mittapalli Kiran Kumar) అధ్యక్షతన వైరాలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం నూతన జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతాచందర్‌రావుకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ  ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ  తక్షణ మాజీ అధ్యక్షులు  వనమా వేణుగోపాలరావు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వైరా వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు దోసపాటి సంధ్యారాణితో పాటు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రథమ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావుకి కూడా ఈ సందర్భంగా ఘనంగా  శాలువాలతో  సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు  అమర వాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఎవరైనా పేద ఆర్యవైశ్యులు ఉన్నట్లయితే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారి అండగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వైరా పట్టణ అధ్యక్షుడు ధారా వెంకటకృష్ణ మహిళా మండలాధ్యక్షురాలు బొగ్గవరపు సునీత ఆర్యవైశ్య సంఘం నాయకులు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, కొప్పురా వూరి వెంకటేశ్వరరావు,మిట్టపల్లి సత్యంబాబు, నూకల ప్రసాదరావు, వెంకట సుబ్బారావు, చక్రధరరావు, మిట్టపల్లి వెంకటరమణ, గజ్జల కృష్ణమూర్తి, సముద్రాల మురళీకృష్ణ, కొల్లా రాంబాబు, చల్లా వెంకటరమణ, జిల్లా అవినాష్, బోనాల సాయి నిఖిల్, తెల్లాకుల సందీప్, విజయ్ కుమార్, యండ్రపూడి శివశంకర్, ఆర్యవైశ్య యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పురావూరి శబరి నాథ్, యువజన సంఘం మండల అధ్యక్షుడు వెంకట సుజిత్, కొమిరిశెట్టి శ్రీధర్, వేముల కిషోర్, కటకం శివకృష్ణ, నూకల అన్నపూర్ణ, కొదుమూరి భాగ్యలక్ష్మి, రాయల రోజా, రాయల అన్నపూర్ణ, గజ్జల మాణిక్యమ్మ, వనమా మణి కుమారి, మిట్టపల్లి మహాలక్ష్మి, మాలే ఉదయ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.