07-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): జేఈఈ- అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంకు సా ధించి ఆంధ్రప్రదేశ్ నుంచి విజయకేతనం ఎ గురవేసిన విజయవాడ నారాయణ కళాశాలకు చెందిన విద్యార్థి వడ్లమూడి లోకేష్ ను, 51వ ర్యాంకు సాధించిన భానుచరణ్రెడ్డిని, 82వ ర్యాంకు సాధించిన తోరాటి భరధ్వాజ్ను, 98వ ర్యాంకు సాధించిన జస్వంత్ వెంకట రఘువీర్ను, వారి తల్లిదండ్రులను ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబా బునాయుడు శుక్రవారం అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ప్రవేశం సాధించటం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు మరి న్ని నూతన శిఖరాలను అధిరో హించాలని ఆకాంక్షించారు. టాప్ ర్యాంకుల సాధనకు విజయసారథ్యం వహించిన నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, శరణి నారాయణ, ప్రేమ్ పొంగూరు పాల్గొన్నారు.