07-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 6 (విజయక్రాంతి): శనివారం నిర్వహించే బక్రీద్ పండుగకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబ స్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు బక్రీద్ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు.
ఎవరైనా అవాం ఛనీయ సంఘటనలు సృష్టించిన లే దా ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జి ల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పా టు చేసి పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టి ఆవుల అక్రమ రవాణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడి యాలో అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.