calender_icon.png 3 January, 2026 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో చీఫ్ కన్సర్వేటర్ పర్యటన

03-01-2026 12:00:00 AM

బోథ్ అటవీ రేంజ్‌లో పరిశీలన

బోథ్, జనవరి 2 (విజయక్రాంతి) : బాసర సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ శరవాణాన్ ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి బోథ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా శాఖ పరం గా చేపట్టిన పనులను ఆయన పర్యవేక్షించారు. వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.

ఈ సంవత్సరం నాటిన అవెన్యూ ప్లాంటేషనలను, వాటికి సంబందించిన రికార్డులను పరిశీలించారు. అనం తరం పెద్దపులి సంచరిస్తున్న అటవీ ప్రాం తాల్లో కలియతిరిగారు. గతంలో ఎన్ని సార్లు ఈ అటవి ప్రాంతంలో కనిపించిన పులుల విషయంపై ఆరా తీశారు. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ అటవీ అధికారి ప్రణయ్, అటవీ సిబ్బంది ఉన్నారు.