2 May, 2026 | 1:11 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

రవితేజ తండ్రి మృతి పట్ల చిరంజీవి సంతాపం

16-07-2025 10:48 AM

టాలీవుడ్‌లో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కోట శ్రీనివాసరావు, బి. సరోజా దేవి మరణాల తర్వాత, స్టార్ నటుడు రవితేజ(Ravi Teja father) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు జూలై 15 రాత్రి 90 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మరణించారు. రాజగోపాల్ రాజు మరణ వార్తపై నటుడు చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. తన సోదరుడు రవితేజ తండ్రి మృతి పట్ల తాను చాలా బాధపడ్డానని చిరంజీవి పేర్కొన్నారు. చివరిసారిగా రాజగోపాల్ రాజును వాల్టెయిర్ వీరయ్య సినిమా సెట్‌లో కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు. రాజగోపాల్ రాజు భౌతికకాయాన్ని ప్రజల నివాళులర్పించేందుకు రవితేజ నివాసంలో ఉంచారు. ఈ మధ్యాహ్నం రాయదుర్గం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు నటుడు రవితేజ. మిగిలిన ఇద్దరు కుమారులు రఘు, భరత్ కూడా నటులు.