25-08-2025 12:56:26 AM
బెల్లంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అకెనపల్లి శివారు లో గల సర్వే నంబర్ 3/పైకిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులకు వెంటనే వాటిని ఖాళీ చేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి నోటీసులు జారీ చేశారు.3/పైకి సర్వే నంబర్ లో ఉన్న 2.75 సెంట్ల భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
అనధికారికంగా ఆక్రమించిన ఈ భూమిలో చేపట్టిన ఇళ్ళతో పలు నిర్మాణాలను స్వచ్ఛందంగా మూడు రోజుల్లో ఖాళీ చేయాలని, ఖాళీ చేయకపోతే కోర్టు ఆదేశాల మేరకు పో లీసు, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్తు శాఖ ల అధికారుల సహాయంతో నిర్మాణదారుల స్వంత ఖర్చులతో బలవంతంగా ఖాళీ చేయించడం జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు.