3 July, 2026 | 8:35 PM

Breaking News

అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •  

సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దు

29-09-2025 07:10 PM

పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్..

పాపన్నపేట (విజయక్రాంతి): సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, ఆర్ఐ నాగరాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుర్తివాడలో బుధవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల వారు సోదరభావంతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పౌరుల హక్కులు, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.