14 April, 2026 | 5:19 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం

20-10-2025 12:00 AM

చొప్పదండి, అక్టోబరు 19 (విజయ క్రాంతి): గంగాధర మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు మధురానగర్ చౌరస్తాలో క్షీరా భిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ మా ట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ ప్రాంతంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసు కువచ్చారని అన్నారు.

గంగాధరలో డిగ్రీ క ళాశాల ఏర్పాటు 20 గ్రామాలకు చెందిన వందలాదిమంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దు బ్బాసి బుచ్చయ్య, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, బుర్గు గంగన్న, వొడ్నాల యగ్నేష్, సాగి అజయ్ రావు, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపు రెడ్డి, పడితపల్లి కిషన్, కర్ర బా పు రెడ్డి, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, దోమకొండ మహేష్, ముచ్చ శంకరయ్య, మంత్రి లత మహేందర్, పడాల రాజన్న, దాతు అంజి, పెంచాల చందు, తదితరులుపాల్గొన్నారు.