30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులతో ముచ్చటించిన సీఎం

08-03-2025 07:12 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మహిళా సంఘాల స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీత్తక్క, పొన్నం ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సందర్శించారు.అనంతరం మహిళా సంఘాల ఒక్కొ ఉత్పత్తుల స్టాళ్ల నిర్వహకులతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు.  మహిళా పెట్రోల్ బంకుల నమూనాలను పరిశీలించిన సీఎం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 15 వేలు వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు.  సభ స్టేజ్ పైకి చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతి సారధి రూపొందించిన 'ఓ మహిళ' అనే పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కారించారు.