05-07-2025 07:11:10 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
48 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన చెక్కుల పంపిణీ..
పటాన్ చెరు (విజయక్రాంతి): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. శనివారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు సంబంధించిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.22 లక్షల 10 వేల విలువైన చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ప్రమోద్ గౌడ్, వెంకటేష్, ఆంజనేయులు, జనార్ధన్, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.