15 June, 2026 | 2:49 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

మంచినీటి బావిని పరిశీలించిన కమిషనర్ రమేష్

14-10-2025 05:58 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లి మానేరు వాగులో ఉన్న మంచినీటి బావిలో మోటర్లు కాలిపోవడంతో సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ పరిశీలించారు. పైనుండి వరద ఉదృతి అధికం కావడంతో బావి చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోయి మోటార్లు కాలిపోవడంతో వరద తగ్గిన అనంతరం మంగళవారం గట్టెపల్లి మంచినీటి బావిలో గల మోటర్లను బాగుపరిచారు.

గత వారం రోజులుగా మున్సిపల్ ప్రాంతంలోని ప్రజలకు త్రాగునీరుకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అంతరాయం లేకుండా సరఫరా చేసి బావిలో ఉన్న మోటార్లను ఆధునికరించిన అనంతరం యధావిధిగా మంచినీరు  అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇట్టి మంచినీటి సరఫరా మరమ్మతులో స్థానిక మున్సిపల్ ఏ.ఈ. రాజ్ కుమార్, మంచినీటి సరఫరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.