18 July, 2026 | 6:08 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు

15-09-2025 09:22 PM

సిపిఎం రాష్ట్ర సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నకిరేకల్,(విజయక్రాంతి): భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలను వ్యతిరేకంగా పోరాడి 4 వేల మంది బలిదానాలు చేసి 3వేల గ్రామాలకు విముక్తి కలిగించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేతేపల్లి మండలంలోని బొప్పారం, కాసనగోడు గ్రామాలలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్నతనంలోనే ప్రాణాలు రజాకార్ల సైన్యం తూటాలకు బలైన పసునూరి వెంకటరెడ్డి స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం అన్నారు. ఈ పోరాటంలో అనేకమంది అమర వీరుల త్యాగాలు మరువలేని కొనియాడారు. వారిచ్చిన స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై  ఉందన్నారు. బాంచన్ నీ కాలు మొక్కుతా అన్న ప్రజలతోనే  బంధుకులు పట్టించిన ఘనత కమ్యూనిస్టులది అన్నారు. భూస్వాములు  జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధాను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని అన్నారు.

ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను  ఆర్ఎస్ఎస్, బిజెపి చరిత్రను వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా పాల్గొన్నారు వారిలో ముఖ్యులు మగ్దూమ్ మోయీనుద్దిన్, సోయబుల్లా ఖాన్,షేక్ బందగి తదితరులు నిజాం పాలన వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. చరిత్రను చరిత్రను వక్రీకరించాలని చూస్తే  చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు