18 July, 2026 | 12:48 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

జోరుగా అక్రమ మట్టి దందా

15-09-2025 10:38 PM

దేవరకొండ,(విజయక్రాంతి): కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో మట్టి మాఫియా బరితెగించింది. ప్రభుత్వ అనుమతులూ తీసుకోకుండా పట్టపగలు సమయాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువైన మట్టిని తవ్వేశారు. ఈ తతంగం అధికారులకు తెలిసే జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండ మల్లెపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నల్లకుంట చెరువులో ఈ దందా సాగుతోంది.

అధికారులంటే భయం లేదు, ప్రజలు గమనిస్తారన్న లెక్కేలేదు,పలువురు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధైర్యమో లేక తమను ఎవరేం చేస్తారన్న ధీమా కాబోలు మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. మల్లేపల్లి పట్టణంలో  మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తా నుంచి ట్రాక్టర్లతో మట్టి వెళ్తున్న పట్టించుకొని అధికారులు.